minister: నాపై హర్షకుమార్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నా.. పరువునష్టం దావా వేస్తా: అవంతి శ్రీనివాస్

  • బోటు అనుమతి కోసం ఏ అధికారిని ఒత్తిడి చేయలేదు
  • హర్షకుమార్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం
  • నాపై ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకు అయినా సిద్ధమే

తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన బోటు ప్రమాద ఘటన అంశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ స్పందించారు. తనపై హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆ రోజున బోటు అనుమతి కోసం ఏ అధికారినీ తాను ఒత్తిడి చేయలేదని, అది పచ్చి అబద్ధం అని అన్నారు. హర్షకుమార్ తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఏ శిక్షకు అయినా తాను సిద్ధమేనని, ఒకవేళ, నిరూపించలేకపోతే హర్షకుమార్ ఏ శిక్షకైనా సిద్ధమేనా? అని ప్రశ్నించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన హర్షకుమార్ పై పరువునష్టం దావా వేస్తానని అవంతి హెచ్చరించారు.

More Telugu News