Harish Rao: 14 ఏళ్ల తర్వాత హరీశ్ రావుతో మాట్లాడిన జగ్గారెడ్డి

  • హరీశ్ రావుతో భేటీ అయిన జగ్గారెడ్డి
  • నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరిన జగ్గారెడ్డి
  • తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చిన హరీశ్

దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడారు. ఎప్పుడూ ఉప్పు, నిప్పుగా వ్యవహరించే వీరిద్దరూ ఈ రోజు కలుసుకున్నారు. హరీశ్ తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు వీరి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా తన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని హరీశ్ ను జగ్గారెడ్డి కోరారు. జగ్గారెడ్డి వినతికి హరీశ్ సానుకూలంగా స్పందించారు. తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. వీరిద్దరి భేటీ తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.

More Telugu News