Nagashaurya: సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగశౌర్య కొత్త చిత్రం

  • సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి 8వ సినిమా 
  • దర్శకురాలిగా లక్ష్మీ సౌజన్య పరిచయం 
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్

యువ కథానాయకులతో విభిన్నమైన కథా చిత్రాలను నిర్మిస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకుంటూ తన ప్రతిష్ఠను పెంచుకునే దిశగా ఈ బ్యానర్ వరుస సినిమాలను నిర్మిస్తూ వెళుతోంది. తాజాగా ఈ బ్యానర్ తన 8వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాను నాగశౌర్య హీరోగా ప్లాన్ చేసింది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో .. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా 'లక్ష్మీ సౌజన్య' దర్శకురాలిగా పరిచయమవుతోంది. ప్రస్తుతం ఇతర తారాగణం .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే ఆ వివరాలను ప్రకటించనున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా తెలియపరిచారు.

More Telugu News