Nagarjuna: నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో కుళ్లిన స్థితిలో మృతదేహం

  • హైదరాబాద్ శివార్లలో నాగార్జునకు 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రం
  • భూమిలోని పాడుబడిన గదిలో మృతదేహం
  • అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు

టాలీవుడ్ హీరో నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ శివార్లలోని పాపిరెడ్డిగూడ (రంగారెడ్డి జిల్లా)లో నాగార్జునకు 40 ఎకరాల స్థలం ఉంది. ఈ భూమిలోని ఓ పాడుబడిన గదిలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. మృతుడు ఎవరో గుర్తించే పనిలో పడ్డారు.

More Telugu News