Gopichand: మరోసారి సంపత్ నందితో గోపీచంద్

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'చాణక్య'
  • నూతన దర్శకుడితో మరో సినిమా 
  • గోపీచంద్ 28వ సినిమాకి సన్నాహాలు      

కొంత కాలంగా గోపీచంద్ ను విజయాలు పలకరించడం లేదు. దాంతో ఆయన కథల ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తూ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'చాణక్య' సిద్ధమవుతోంది. ఆ తరువాత ప్రాజెక్టు ద్వారా సుబ్రహ్మణ్యం అనే ఒక నూతన దర్శకుడిని గోపీచంద్ పరిచయం చేస్తున్నాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ పేరు వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మరో సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చింది. సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. 'గౌతమ్ నంద' తరువాత గోపీచంద్ - సంపత్ నంది కలిసి చేస్తోన్న సినిమా ఇది. గోపీచంద్ కి ఇది 28వ సినిమా .. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More Telugu News