Andhra Pradesh: నూజివీడులో పిచ్చికుక్క స్వైరవిహారం.. రోడ్డుపై పరుగులు పెట్టిన ప్రజలు!

  • వెంటపడి కరచిన పిచ్చికుక్క
  • ఆరుగురికి తీవ్రగాయాలు
  • చికిత్స అందిస్తున్న వైద్యులు

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఓ పిచ్చి కుక్క రెచ్చిపోయింది. నూజివీడు పట్టణంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ప్రజలను వెంటపడి కరవడం మొదలుపెట్టింది. దీంతో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, పలువురికి స్వల్పగాయాలు అయ్యాయి. వీరందరినీ స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స అందజేశారు. ఈ సందర్భంగా పిచ్చి కుక్క నుంచి తప్పించుకునేందుకు ప్రజలు పరుగులు పెట్టారు.

ఈ విషయమై బాధితులు మాట్లాడుతూ.. పట్టణంలో కుక్కల బెడద అధికమైందని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదని విమర్శించారు. అధికారులు నిర్లక్ష్యంతో తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నూజివీడులో కుక్కల బెడదను తగ్గించాలని కోరారు. కాగా, ఈ విషయమై ఇటు అధికారులు, అటు నేతలు ఇప్పటివరకూ స్పందించలేదు.

More Telugu News