team india: రెండో టీ20లో భారత్ ఘన విజయం.. చితక్కొట్టిన కోహ్లీ

  • ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ 
  • 22న బెంగళూరులో చివరి టీ20

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొహాలీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ అలవోకగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్ క్వింటన్ డికాక్ 52, తెంబా బవుమా 49 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

అనంతరం 150 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ శిఖర్ ధవన్ 40, కెప్టెన్ విరాట్ కోహ్లీ 72 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ సేన ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ నెల 22న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మూడో మ్యాచ్ జరగనుంది. 72 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

More Telugu News