kashmir: వైష్ణోదేవీ భక్తులకు ‘రైల్వే’ శుభవార్త.. ఢిల్లీ-కాట్రా మధ్య నడవనున్న హైస్పీడ్ ట్రైన్!

  • ఢిల్లీ-కాట్రా మధ్య ‘వందే భారత్’ రైలు
  • దసరా నవరాత్రి ఉత్సవాల రోజుల్లో ప్రారంభం 
  • రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్

కశ్మీర్ లోని వైష్ణోదేవీ ఆలయాన్ని సందర్శించే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఢిల్లీ-కాట్రా మధ్య ‘వందే భారత్’ రైలును త్వరలో ప్రారంభించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. దసరా నవరాత్రి ఉత్సవాల రోజుల్లో ఈ రైలును ప్రారంభించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఢిల్లీ-కాట్రా మధ్య నడవనున్న ఈ రైలు ‘హైస్పీడ్ ట్రైన్’. ఢిల్లీ-వారణాసి మధ్య ఇప్పటికే ‘వందే భారత్’ పేరిట ఓ హైస్పీడ్ ట్రైన్ నడుస్తోంది. ఢిల్లీ-కాట్రా మధ్య మరో ‘వందే భారత్’ నడవనుంది.

More Telugu News