Venkatesh: 'వెంకీమామ' ప్రేక్షకుల ముందుకొచ్చేది అప్పుడే!

  • బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ'
  • పాట మినహా చిత్రీకరణ పూర్తి 
  • డిసెంబర్ ఫస్టు వీక్ లో రిలీజ్

బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ' సినిమా షూటింగు జరుపుకుంటోంది. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మేనమామ - మేనల్లుడు పాత్రల్లో ఈ సినిమాలో వెంకటేశ్ .. చైతూ నటిస్తున్నారు. ఈ ఇద్దరి సరసన నాయికలుగా రాశి ఖన్నా .. పాయల్ నటిస్తున్నారు.

విభిన్నమైన కథాకథనాలతో పూర్తి వినోదభరితంగా ఈ సినిమా సాగనుంది. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలతో ఈ కథను తీర్చిదిద్దినట్టుగా చెబుతున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉండటం వలన, డిసెంబర్ ఫస్టు వీక్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ మల్టీ స్టారర్ మూవీ ఏ స్థాయిలో హిట్ కొడుతుందో చూడాలి మరి.

More Telugu News