Kodela: కేబుల్ వైర్ తో ఉరివేసుకున్న కోడెల.. డాక్టర్ సుమతికి చివరి ఫోన్ కాల్

  • 20 రోజుల క్రితం హైదరాబాదుకు వచ్చిన కోడెల
  • ఆత్మహత్యకు రకరకాలుగా ప్లాన్ చేసుకున్న మాజీ స్పీకర్
  • భార్య, కూతురు, గన్ మెన్, డ్రైవర్ తో పాటు ప్రత్యక్ష సాక్షులుగా మరో నలుగురు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కేబుల్ వైర్ తో ఉరి వేసుకున్నారని పోస్ట్ మార్టం నివేదికలో ఉస్మానియా వైద్యులు తెలిపారు. మరోవైపు, ఆత్మహత్యకు పాల్పడే ముందు బసవతారకం కేన్సర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సుమతికి ఆయన చివరి కాల్ చేశారు. ఈ విషయాన్ని కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు.

20 రోజుల క్రితమే కోడెల హైదరాబాదుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. కూతురు, భార్య, గన్ మెన్, డ్రైవర్ తో పాటు మరో నలుగురిని ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులు పెట్టారు. కోడెల వాడుతున్న మందులను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా కేసును పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.  మరోవైపు, ఆత్మహత్యకు కోడెల రకరకాలుగా ప్లాన్ చేసుకున్నట్టు భావిస్తున్నారు. తొలుత తన పంచెతో ఉరివేసుకోవాలని ఆయన భావించారని... అది సాధ్యం కాకపోవడంతో, చివరకు కేబుల్ వైర్ తో ఉరి వేసుకున్నారని చెబుతున్నారు.

More Telugu News