TTD: టీటీడీ కొత్త పాలకమండలి సభ్యుల వివరాలు!

  • టీటీడీ చైర్మన్ గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి
  • తాజాగా పాలకమండలి సభ్యుల నియామకం
  • అన్ని రంగాల ప్రముఖులకు బోర్డులో స్థానం

వైసీపీ సర్కారు వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి నియామకం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా, టీటీడీ పాలకమండలి సభ్యులను కూడా నియమించారు. చైర్మన్, 28 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి కొలువుదీరింది. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యేలు మల్లికార్జునరెడ్డి, కె. పార్థసారథి, యూవీ రమణమూర్తి నియమితులయ్యారు.

వీరితోపాటు వి.ప్రశాంతి, పరిగెల మురళీకృష్ణ, కృష్ణమూర్తి వైద్యనాథన్, జూపల్లి రామేశ్వరరావు, ఎన్.శ్రీనివాసన్, బి.పార్థసారథి రెడ్డి, డాక్టర్ నిశ్చిత ముప్పవరపు, డీపీ అనంత, నాదెండ్ల సుబ్బారావు, రమేశ్ శెట్టి, రాజేశ్ శర్మ, మోరంశెట్టి రాములు, జి.వెంకట భాస్కరరావు, డి.దామోదర్ రావు, చిప్పగిరి ప్రసాద్ కుమార్, ఎంఎస్ శివశంకరన్, సంపత్ రవినారాయణ, సుధా నారాయణ మూర్తి, కుమారగురు, పుత్తా ప్రతాపరెడ్డి, కె.శివకుమార్ కూడా నియమితులయ్యారు. నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులకు కూడా పాలకమండలిలో స్థానం దక్కింది. కాగా, అన్ని రంగాల ప్రముఖులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించినట్టు అర్థమవుతోంది.

More Telugu News