Telangana: ఎస్సైతో వాగ్వాదం.. తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

  • తెలంగాణలోని నిజామాబాద్ లో ఘటన
  • ఇందల్వాయి పీఎస్ లో హెడ్ గా ప్రకాష్
  • ప్రకాష్ కి, ఎస్సైకి ఓ కేసు విషయమై వాగ్వాదం

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కేసు విషయంలో ఎస్ఐతో వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకున్నాడు. జిల్లాలో ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో ప్రకాష్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.

అయితే ఓ కేసు విషయంలో ప్రకాష్-ఎస్సైల మధ్య గత 2-3 రోజులుగా వాగ్వాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు కూడా ఎస్సైతో వాగ్వాదం జరగడంతో ప్రకాష్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. వెంటనే ఎస్సై రివాల్వర్ తీసుకుని తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News