IB: నిఘా హెచ్చరికల నేపథ్యంలో.. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో అప్రమత్తత

  • రైళ్లు, రైల్వే స్టేషన్ల లక్ష్యంగా దాడులు జరగొచ్చంటూ ఐబీ హెచ్చరిక
  • భద్రత పెంచాలని నిర్ణయించిన ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్
  • కీలక రైల్వే స్టేషన్లలో ఆర్పీఎఫ్ తనిఖీలు

ఉగ్రవాదులు దేశంలోని ప్రధాన రైల్వేస్టేషన్లను, రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో, దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రత పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. రైళ్లలో కూడా పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు.

More Telugu News