Kodela: రేపు నరసరావుపేటలో బంద్... పిలుపునిచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్

  • రేపు నరసరావుపేటలో కోడెల అంత్యక్రియలు
  • వ్యాపార, విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం
  • నరసరావుపేట చేరుకున్న కోడెల కుటుంబ సభ్యులు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయం ఈ రాత్రికి నరసరావుపేట చేరుకుంటుంది. గుంటూరు నుంచి కోడెల అంతిమయాత్ర సత్తెనపల్లి మీదుగా నరసరావుపేట చేరుకోనుంది. రేపు కోడెల అంత్యక్రియలు నరసరావుపేటలో నిర్వహించనున్నారు.

 ఈ నేపథ్యంలో, కోడెల మృతికి సంతాపంగా రేపు నరసరావుపేటలో బంద్ పాటించనున్నారు. వ్యాపార, విద్యా సంస్థలు మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చింది. కాగా, కోడెల కుటుంబ సభ్యులు నరసరావుపేట వచ్చారు. కోడెల భార్య శశికళ, కుమార్తె విజయలక్ష్మి హైదరాబాద్ నుంచి నరసరావుపేటలోని తమ నివాసానికి చేరుకున్నారు.

More Telugu News