Hyderabad: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్
  • హైదరాబాద్ లో విషజ్వరాలు, కాలుష్యం పెరిగిపోయాయి 
  • రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్, పండ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ లో విషజ్వరాలు, కాలుష్యం పెరిగిపోయాయని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా మోదీపై ప్రశంసలు కురిపించారు. దేశ గతిని మార్చిన గొప్ప వ్యక్తి మోదీ అని కొనియాడారు. ఈరోజు మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వచ్చిన రోజుకూడా అని, ఈ మూడు కలిసి ఒకేరోజు రావడం శుభకరం అని అన్నారు.

More Telugu News