Narendra Modi: పుట్టినరోజున అమ్మతో కలసి భోజనం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!

  • నేడు గుజరాత్ పర్యటనకు విచ్చేసిన మోదీ
  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • అమ్మ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తన 69వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ మధ్యాహ్నం గాంధీనగర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లి హీరాబెన్ ను కలసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం ఇద్దరూ కలిసి గుజరాతీ భోజనం చేశారు. ఆ తర్వాత తల్లి ఆరోగ్యం, యోగక్షేమాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు తల్లితో ముచ్చటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

More Telugu News