Telangana: యురేనియం రగడ.. తెలంగాణ సర్కారుపై రకుల్ ప్రీత్ సింగ్ ప్రశంసలు!

  • తెలంగాణలో సేవ్ నల్లమల ఉద్యమం
  • సినీ, రాజకీయ ప్రముఖుల మద్దతు
  • కేటీఆర్ ట్వీట్ పై హర్షం వ్యక్తం చేసిన రకుల్

తెలంగాణలోని నల్లమల అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అనుమతించబోమని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు, పర్యావరణవేత్తలతో పాటు సినీనటులు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గళం విప్పడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

తెలంగాణలోని నల్లమల అటవీప్రాంతంలో ఎలాంటి యురేనియం తవ్వకాలు ఉండవని కేటీఆర్ స్పష్టం చేయడంపై తాజాగా టాలీవుడ్ నటి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని ప్రశంసించింది.

More Telugu News