RBI: ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగిన పొదుపు ఖాతాల జమ

  • గణాంకాలు వెల్లడించిన రిజర్వు బ్యాంకు
  • ఏకంగా రూ. 4 లక్షల కోట్ల మేర వృద్ధి
  • రుణాల్లో కూడా భారీ పెరుగుదల

దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో గత ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు గణనీయంగా పెరిగినట్టు భారతీయ రిజర్వు బ్యాంకు తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర పొదుపు జమలు పెరిగినట్టు ఆర్‌బీఐ పేర్కొంది. గత అర్థిక సంవత్సరంలో రూ.36.55 లక్షల కోట్ల సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 40.31 లక్షల కోట్లకు పెరిగినట్టు వివరించింది.

 ఈ మొత్తం డిపాజిట్లలో రూ.39.72 లక్షల కోట్లు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లోని డిపాజిట్లు కాగా, రూ.58,630 కోట్లు విదేశీ బ్యాంకుల్లో జమ అయినట్టు తెలిపింది. ఇక, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సగటు డిపాజిట్లు 6.7 శాతం, రుణాలు 8.7 శాతం పెరిగినట్టు తెలిపింది. అదే సమయంలో ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు 16.3 శాతం, రుణాలు 17.5 శాతం పెరిగినట్టు రిజర్వుబ్యాంకు గణాంకాలు వెల్లడించాయి.

More Telugu News