Allu Arjun: ప్యారిస్ కి 'అల వైకుంఠపురములో' టీమ్

  • షూటింగు దశలో 'అల వైకుంఠపురములో'
  • కీలక పాత్రలో 'టబు'
  • సంక్రాంతికి విడుదల

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసినివారు నిర్మిస్తున్నారు. ఆ మధ్య కాకినాడలో ఈ సినిమా కోసం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో వేసిన ఖరీదైన సెట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్ ను ప్యారిస్ లో ప్లాన్ చేసినట్టుగా సమాచారం. వచ్చేనెల మొదటివారంలో ప్యారిస్ లో ఈ షెడ్యూల్ షూటింగు మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలతో పాటు, ఒకటి రెండు పాటలను కూడా అక్కడ చిత్రీకరించనున్నట్టు సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో 'టబు' కీలకమైన పాత్రలో కనిపించనుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News