Balakrishna: మరోసారి బాలకృష్ణతో పూరి సినిమా

  • కేఎస్ రవికుమార్ తో బాలకృష్ణ 
  • తదుపరి సినిమా బోయపాటితో 
  • లైన్లో రెడీగా పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్ - బాలకృష్ణ కాంబినేషన్లో గతంలో 'పైసా వసూల్' వచ్చింది. ఈ సినిమా హిట్ అనిపించుకోలేదుగానీ, మాస్ ఆడియన్స్ నుంచి మాత్రం ఓకే అనిపించుకుంది. తమ నుంచి మరో సినిమా ఉంటుందని ఆ సమయంలోనే పూరి చెప్పాడు. గతంలో చెప్పినట్టుగానే బాలకృష్ణతో పూరి ఒక ప్రాజెక్టును సెట్ చేశాడనేది తాజా సమాచారం.

ప్రస్తుతం బాలకృష్ణ .. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఆ తరువాత బోయపాటితో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఇక పూరి తన తదుపరి సినిమాను విజయ్ దేవరకొండతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తరువాత పూరి - బాలకృష్ణ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.

More Telugu News