Boat accident: సాయంత్రానికి సహాయక చర్యలు పూర్తి: మంత్రి అవంతి

  • నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్న సహాయక చర్యలు
  • ధవళేశ్వరం బ్యారేజీకి ఉన్న 175 గేట్లు మూసివేత
  • ముమ్మరంగా గాలింపు

గోదావరి నదిలో గాలింపు చర్యలను ముమ్మరం చేశామని, ఈ సాయంత్రానికి సహాయక చర్యలను పూర్తిచేస్తామని ఏపీ పర్యాటక శాఖామంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది ఈ ఉదయం మళ్లీ సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ధవళేశ్వరం బ్యారేజీకి ఉన్న 175 గేట్లను మూసివేశారు. గేట్లు మూసివేత వల్ల గాలింపు మరింత సులభం అవుతుందని అధికారులు తెలిపారు.

More Telugu News