Jagan: దేవీపట్నం వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయం

  • దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునక
  • 39 మంది గల్లంతు
  • ఘటనాస్థలాన్ని సందర్శించనున్న జగన్
  • బాధితుల కుటుంబాలను పరామర్శించనున్న సీఎం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఘటనాస్థలాన్ని సందర్శించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఆయన రేపు దేవీపట్నం వెళుతున్నారు. అధికారులతో కలిసి బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. కాగా, బోటు మునిగిన ఘటనలో 39 మంది గల్లంతు కాగా, ఇప్పటివరకు 8 మృతదేహాలను వెలికితీశారు.

More Telugu News