East Godavari District: బోటు ఒక్కసారిగా తిరగబడింది.. ప్రాణాలతో బయటపడ్డ వరంగల్ వాసి

  • వరంగల్, కాజీపేట్ నుంచి మొత్తం 14 మంది వచ్చాం
  • బోటు ఒక్కసారిగా తిరగబడింది
  • నీళ్లలో దొరికిన లైఫ్ జాకెట్ తొడుక్కున్నానన్న ప్రత్యక్షసాక్షి

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో గోదావరిలో బోటు ప్రమాద సంఘటనపై ప్రత్యక్షసాక్షి ఒకరు స్పందించారు. వరంగల్, కాజీపేట్ నుంచి మొత్తం 14 మంది ఈ పర్యటనకు వచ్చామని ప్రాణాలతో బయటపడ్డ దశరథమ్ అన్నారు. కాజీపేటకు చెందిన దశరథమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటన ఎలా జరిగిందని ఆయన్ని మీడియా ప్రశ్నించింది. బోటు ఒక్కసారిగా తిరగబడిందని, నదిలోకి పడిపోయామని చెప్పారు. లైఫ్ జాకెట్ ఒకటి నీళ్లలో తేలడంతో దాన్ని తీసుకుని ధరించానని తెలిపారు. ఆ తర్వాత చిన్ప పడవలో కొందరు వచ్చి తనను రక్షించారని పేర్కొన్నారు. పద్నాలుగు మందిలో ఐదుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డామని, మిగిలిన వాళ్లు కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News