Madhya Pradesh: వృద్ధుడి తలపై మొలిచిన కొమ్ము.. ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు

  • ప్రమాదంలో గాయపడిన శ్యాంలాల్
  • తలకు అయిన గాయం నుంచి మొలిచిన కొమ్ము
  • వింతగా చూసిన జనం

మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తలపై మొలిచిన కొమ్మును వైద్యులు అరుదైన శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. రాష్ట్రానికి చెందిన శ్యాంలాల్ యాదవ్ (74) అనే వ్యక్తికి గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తలకు గాయమైంది. ఆ తర్వాత ఆ గాయం పుండుగా మారి క్రమంగా కొమ్ములా పెరగడం ప్రారంభమైంది.

తలపై పెరుగుతున్న కొమ్ముతో తొలుత ఆయన కొంత ఇబ్బంది పడేవారు. జనం కూడా వింతగా చూసేవారు. అయితే క్రమంగా దానిని ఆయన పట్టించుకోవడం మానేశారు. ఆ తర్వాత తలపై పెరుగుతున్న కొమ్మును తనంతట తానుగానే ఆయన కత్తిరించుకునేవారు. కాగా, ఇటీవల ఆయనకు అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యులు తలపై మొలిచిన కొమ్మును తొలగించారు.

More Telugu News