Sye Raa Narasimha Reddy: ఇండియా గేట్ వద్ద 'సైరా' జెండాను ఆవిష్కరించిన అఖిల భారత చిరంజీవి యువత.. ఫొటోలు ఇవిగో!

  • బ్రిటిషు వారితో పోరాడి అమరుడైన ఉయ్యాలవాడ 
  • చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న భారీ చిత్రం 
  • దేశ రాజధానిలో సైరా జెండా ఆవిష్కరణ

ప్రతీ రక్తకణంలో దేశభక్తిని నింపుకుని బ్రిటిషు వారితో పోరాడి అమరుడైన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను 'సైరా' పేరిట వెండితెరపై ఆవిష్కరిస్తున్న సంగతి విదితమే. చిరంజీవి టైటిల్ రోల్ ను పోషిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ 'సైరా' చిత్రం జెండాను దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈ రోజు ఆవిష్కరించారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అందుకు సంబంధించినవే కింది ఫొటోలు..  

More Telugu News