Crime News: కామాంధుల బారి నుంచి తప్పించుకుని...నగ్నంగా వీధుల్లో పరిగెడుతూ!

  • అత్యాచారం బాధితురాలి దీన పరిస్థితి
  • స్నేహితులతో వెళుతున్న బాలిక కిడ్నాప్‌
  • నిర్మానుష్య ప్రాంతానికి ఈడ్చుకు వెళ్లి అఘాయిత్యం

మద్యం మత్తులో కన్నూమిన్నూగానక దారుణానికి ఒడిగట్టారు ముగ్గురు దుర్మార్గులు. స్నేహితులతో కలిసి వెళ్తున్న బాలికను బలవంతంగా లాక్కుపోయి అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక వీధుల్లో నగ్నంగా పరిగెడుతుంటే స్థానికులు ఆదుకున్నారు.

వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం భీల్‌వాడాలో ఓ బాలిక తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్తోంది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు దుర్మార్గులు మధ్యలో వారిని అడ్డగించి దౌర్జన్యానికి దిగారు. దీంతో ఆమె స్నేహితులు పారిపోగా, బాలికను నిందితులు నిర్మానుష్య ప్రాంతానికి ఈడ్చుకు వెళ్లారు.

ఈలోగా తప్పించుకుని పారిపోయి వచ్చిన స్నేహితులు స్థానికంగా ఉన్న ఓ దుకాణ యజమానికి జరిగిన విషయం తెలియజేయగా వారితోపాటు అతను ఘటనా స్థలికి వచ్చాడు. అయితే అప్పటికే దుండగులు బాధిత బాలికను తీసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు.

వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలిక ఒంటిపై నూలుపోగు లేకున్నా ప్రాణాలు దక్కించుకుంటే చాలనుకుని అర కిలోమీటరు దూరం నగ్నంగా పరుగందుకుని స్థానిక నివాస ప్రాంతాలకు చేరుకుంది. దీంతో అక్కడి వారు ఆమెకు దుస్తులు అందించి ఆదుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు ముగ్గురిని వారు అరెస్టు చేశారు.

More Telugu News