PV Sindhu: పీవీ సింధుకు ఖరీదైన కారును బహూకరించనున్న చాముండి.. చీఫ్ గెస్ట్ గా నాగార్జున

  • ప్రపంచ ఛాంపియన్ షిప్ ను సాధించిన పీవీ సింధు
  • సింధుకు నజరానాలు ప్రకటిస్తున్న పలువురు ప్రముఖులు
  • బీఎండబ్ల్యూ కారును ఇవ్వనున్న చాముండేశ్వరినాథ్

స్విట్జర్లాండ్ లో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన పీవీ సింధు... ఆ ఘనత సాధించిన తొలి భారతీయ యువతిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆమెకు పలువురు ప్రముఖులు నజరానాలు ప్రకటిస్తున్నారు. మాజీ క్రికెటర్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ ఆమెకు ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహూకరించనున్నారు. నేటి మధ్యాహ్నం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు నాగార్జున హాజరుకానున్నారు. మరోవైపు, విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడెమీ కోసం సింధుకు ఏపీ సీఎం జగన్ 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

More Telugu News