ఊళ్లో మమ్మల్ని వెలివేశారు.. మా నాన్న, తాతను చంపేస్తారట!: ముఖ్యమంత్రి జగన్కు 8 ఏళ్ల చిన్నారి లేఖ

- జగన్కు రామచంద్రపురం బాలిక లేఖ
- తమతో ఎవరూ మాట్లాడడం లేదని ఆవేదన
- వైరల్ అవుతున్న లేఖ
ఈ నెల నాలుగో తేదీ నుంచి తమ ముగ్గురితో స్కూలులో ఎవరూ మాట్లాడడం లేదని, ఎవరైనా మాట్లాడితే రూ. 10 వేల జరిమానా వేస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమను ఊర్లోనుంచి వెలివేశారని అందరూ అంటున్నారని పేర్కొంది. తమతో ఎవరూ మాట్లాడడం లేదని, ఆడుకోవడానికి కూడా రావడం లేదని పేర్కొంది. అంతేకాదు, నాన్న, తాతను చంపేస్తారని స్నేహితులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు చాలా భయంగా ఉందని పేర్కొంటూ లేఖలో తండ్రి ఫోన్ నంబరు, వివరాలను ఇచ్చింది.
కాగా, స్థానికంగా ఉన్న వివాదం కారణంగా వెంకటేశ్వర్లు కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ విషయాన్ని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విషయాన్ని పుష్ప లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లింది.