Andhra Pradesh: ఆరుగురు సభ్యులతో కమిటీ నియామకం... ఏపీ రాజధాని నిర్మాణం, అభివృద్ధి పథకాలే అజెండా!

  • రాజధాని నిర్మాణం కోసం కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు
  • కన్వీనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు
  • కమిటీలో ఐదుగురు నిపుణులకు చోటు

ఏపీ సర్కారు రాజధాని నిర్మాణం కోసం కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. రాజధాని నిర్మాణం, ఇతర అభివృద్ధి పథకాల ప్రణాళికలపై సలహాలు ఇవ్వడమే ఈ నిపుణుల కమిటీ చేయాల్సిన పని. ఈ కమిటీకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఏర్పాటుపై మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

కమిటీ సభ్యులు వీరే...

  • జీఎన్ రావు-రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
  • డాక్టర్ మహావీర్-ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్
  • డాక్టర్ అంజలి మోహన్-అర్బన్ ప్లానర్
  • కేటీ రవీంద్రన్-ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ రిటైర్డ్ ప్రొఫెసర్
  • కేవీ అరుణాచలం-రిటైర్డ్ అర్బన్ ప్లానర్
  • శివానంద స్వామి-సెప్ట్ ఫ్రొఫెసర్


More Telugu News