Dhoni: ధోనీ సాధించాల్సింది ఏమీ లేదు.. ఏం చేయాలో అతనికి తెలుసు: చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్

  • భారత్ కు ధోనీ రెండు ప్రపంచ కప్ లు అందించాడు
  • ధోనీ నాయకత్వంలో టీమిండియా ఎంతో మెరుగుపడింది
  • రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకోవాలో ధోనీకి తెలుసు

అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఎంతో సాధించాడని చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కితాబిచ్చాడు. క్రికెట్ నుంచి ఎప్పుడు తప్పుకోవాలో ధోనీకి తెలుసని... ఈ విషయంలో ఆయనకు ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు. భారత్ కు ధోనీ రెండు ప్రపంచ కప్ లు అందించాడని గుర్తుచేశాడు. ధోనీ నాయకత్వంలో టీమిండియా అన్ని ఫార్మాట్లలో మెరుగు పడిందని చెప్పాడు. ఇంతకన్నా ఎవరైనా సాధించేది ఏముంటుందని అన్నాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ధోనీకి తెలుసని చెప్పాడు.

More Telugu News