Burrial Yard: శ్మశానాలనూ వదలి పెట్టరా... అంటూ ఫొటో పోస్ట్ చేసిన కేశినేని నాని!

  • శ్మశానం గోడలకు వైసీపీ రంగులు
  • వాటిని కూడా వదిలిపెట్టరా?
  • ట్విట్టర్ లో నాని మండిపాటు

శ్మశానాలను కూడా వదలడం లేదని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని పరోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. "శ్మశాన వాటికలు కూడా వదిలి పెట్టరా?" అని కామెంట్ చేస్తూ, ఓ చిత్రాన్ని పోస్ట్ చేశారు. దీనిలో శ్మశానం గోడలకు, అందులోని ఓ చిన్న గదికి, ఆర్చ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసివుండటం గమనార్హం.

ఈ చిత్రం ఎక్కడిదన్న విషయాన్ని మాత్రం కేశినేని నాని వెల్లడించ లేదు. ఈ ట్వీట్ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. క్లారిటీ లేని ట్వీట్స్ పెట్టడం ఎందుకని కొందరు నెటిజన్లు విమర్శలకు దిగుతున్నారు కూడా.

More Telugu News