Andhra Pradesh: తెలుగుదేశం నేత నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదు!

  • ‘ఛలో ఆత్మకూరు’ సందర్భంగా గొడవ
  • నన్నపనేని కులం పేరుతో దూషించారని ఎస్సై ఆగ్రహం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత మహిళా ఎస్సై అనురాధ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిన్న ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం నేత నన్నపనేని రాజకుమారి, స్థానిక ఎస్సై అనురాధ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నన్నపనేని తనను కులం పేరుతో దూషించారనీ, ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అని వ్యాఖ్యానించినట్లు ఎస్సై ఆరోపించారు. తాజాగా  ఈ వ్యవహారంలో ఎస్సై ఫిర్యాదుతో నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్  303, 506,509 r/w 34 కింద పోలీసులు కేసు నమోదుచేశారు.

More Telugu News