Sai Dharam Tej: మెగా హీరోకి జోడీగా ఛాన్స్ కొట్టేసిన నభా నటేశ్

  • 'ఇస్మార్ట్ శంకర్'తో పెరిగిన నభా క్రేజ్ 
  • 'డిస్కోరాజా'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు 
  • అక్టోబర్ నుంచి తదుపరి సినిమా

'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా నటేశ్, గ్లామర్ పరంగా కుర్రకారు మనసులను దోచేసింది. తొలి సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ సుందరి, రెండవ సినిమాతోనే పూరి ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది. ఆయన దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో తెలంగాణ అమ్మాయిగా మంచి మార్కులు కొట్టేసింది.

ప్రస్తుతం రవితేజకు జోడీగా 'డిస్కోరాజా' సినిమా చేస్తోన్న ఈ అమ్మాయి, సాయిధరమ్ తేజ్ సరసన అవకాశాన్ని దక్కించుకుందనేది తాజా సమాచారం. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండగే' సినిమా చేస్తోన్న తేజూ, తదుపరి సినిమాను 'సుబ్బు' అనే కొత్త దర్శకుడితో చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నభా నటేశ్ ను ఎంపిక చేసుకున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

More Telugu News