Tirumala: ఎన్నారై దాతృత్వం... తిరుమల వెంకన్నకు రూ. 1,00,00,116 విరాళం!

  • విదేశాల నుంచి వచ్చిన శ్రీనివాస రెడ్డి
  • నిత్యాన్నదానానికి భారీ విరాళం
  • తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు

తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి తనలోని భక్తిని చాటుకుంటూ, నిత్యాన్నదాన పథకానికి కోటీ నూటపదహారు రూపాయల విరాళాన్ని ఇచ్చాడో ప్రవాస భారతీయుడు. ఈ మేరకు విరాళాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఎమ్ శ్రీనివాస రెడ్డి అనే దాత అందించగా, టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి కలసి అందుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డితో తిరుమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన అధికారులు, అనంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు ఆశీర్వచనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమలలో అవిశ్రాంతంగా సాగే నిత్యాన్నదానానికి తన వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విరాళాన్ని అందించినట్టు ఆయన తెలిపారు.

More Telugu News