Andhra Pradesh: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల వెల్లడి.. విడుదల చేసిన హోం మంత్రి!

  • జాబితా విడుదల చేసిన హోంమంత్రి సుచరిత
  • కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్
  • రాత పరీక్షలో లక్ష మంది ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 2,623 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. 2623 ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల పేర్లను హోంమంత్రి సుచరిత అమరావతిలో ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కానిస్టేబుల్ రాతపరీక్షకు 3,51,860 మంది హాజరుకాగా, 1,09,106 మంది ఉత్తీర్ణులయ్యారు. చివరికి 2,623 మందిని ఎంపిక చేశారు.

More Telugu News