Hyderabad: రూ. 17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ... దక్కించుకున్న కొలన్ రామిరెడ్డి!

  • ఉత్సాహంగా సాగిన వేలం పాట
  • మరోమారు దక్కించుకున్న కొలన్ ఫ్యామిలీ
  • రెండు కిలోల వెండి పళ్లెంలో లడ్డు

గణేశ్ భక్తులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే హైదరాబాద్, బాలాపూర్ వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూ ప్రసాదం వేలం ముగిసింది. ఈ సంవత్సరం వేలంపాటలో లడ్డూను కొలన్ రామిరెడ్డి రూ. 17.60 లక్షలకు దక్కించుకున్నారు. గత సంవత్సరం లడ్డూ ధర రూ. 16.60 లక్షలకు పోగా, ఈ సంవత్సరం లడ్డూ ధర దాన్ని మించింది.

రెండు కిలోల బరువున్న వెండి పళ్లెంలో ఉంచిన 21 కిలోల లడ్డూను ఉత్సవ నిర్వాహకులు కొలన్ రామిరెడ్డికి అందించారు. కాగా, కొలన్ ఫ్యామిలీ సభ్యులు గతంలో పలుమార్లు లడ్డూను దక్కించుకున్నారు.

More Telugu News