Hyderabad: పెండింగులో 119 చలాన్లు.. క్యాబ్ డ్రైవర్ నుంచి రూ.27,165 వసూలు చేసిన ట్రాఫిక్ పోలీసులు

  •  గత కొంతకాలంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న డ్రైవర్
  • ఒక్కదానికీ జరిమానా చెల్లించని వైనం
  • నిన్న ఔటర్‌పై దొరికిన క్యాబ్ 

119 చలాన్లు పెండింగ్‌లో ఉంచుకుని దర్జాగా రోడ్డుపై తిరుగుతున్న ఓ క్యాబ్ డ్రైవర్ నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూ.27,165 వసూలు చేశారు. నార్సింగి ప్రాంతానికి చెందిన రమేశ్ క్యాబ్ నడుపుతున్నాడు. గతంలో పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ట్రాఫిక్ పోలీసులు ఆ కారుకు 119 చలాన్లు పంపారు. అయితే, ఏ ఒక్క చలానకు కారు యజమాని స్పందించలేదు.

ఈ క్రమంలో నిన్న గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగురోడ్డు సమీపంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో ఈ కారు పోలీసుల కంటపడింది. వెంటనే అడ్డుకున్న పోలీసులు పెండింగులో ఉన్న చలాన్ల మొత్తం రూ.27,165ను వసూలు చేశారు.

More Telugu News