Bc commission: ఏపీలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు.. చైర్మన్ గా జస్టిస్ శంకరనారాయణ నియామకం

  • బీసీలకు న్యాయం చేసేందుకు శాశ్వత ప్రాతిపదికన కమిషన్
  • ఈ పదవిలో మూడేళ్లు కొనసాగనున్న శంకరనారాయణ
  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు

ఏపీలో శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ జస్టిస్ శంకరనారాయణను నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. సామాజికంగా వెనుకబడిన బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంలో భాగంగానే శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాగా, జస్టిస్ శంకర నారాయణ ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు.

More Telugu News