Allu Arjun: 'అల వైకుంఠపురములో'నుంచి దసరాకి టీజర్

  • షూటింగు దశలో బన్నీ మూవీ 
  • కీలకమైన పాత్రలో 'టబు'
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ కథానాయకుడిగా 'అల వైకుంఠపురములో' చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది.

త్రివిక్రమ్ పుట్టినరోజైన నవంబర్ 7వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయాలని భావించారు. కానీ తాజాగా ఆ ఆలోచనను విరమించుకున్నారట. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 8వ తేదీన టీజర్ ను వదలాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఒక నెల ముందుగానే టీజర్ ను వదలనుండటం బన్నీ అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం. గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల చేసే ఈ సినిమాలో 'టబు' కీలక పాత్రలో కనిపించనుంది.

More Telugu News