Sensex: అంతర్జాతీయ సానుకూలతలతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 125 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 33 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 13 శాతం పైగా లాభపడ్డ యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ సానుకూలతలతో మార్కెట్లు పాజిటివ్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 125 పాయింట్లు లాభపడి 37,271కి చేరింది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 11,036 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (13.47%), టాటా మోటార్స్ (10.21%), మారుతి సుజుకి (4.18%), టాటా స్టీల్ (3.85%), వేదాంత లిమిటెడ్ (3.44%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-2.93%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.48%), సన్ ఫార్మా (-1.57%), ఎన్టీపీసీ (-1.35%), టీసీఎస్ (-1.34%).

More Telugu News