Samantha: ప్రియమైన సమంత... అనుకున్న దానికంటే నువ్వు ఎక్కువే సాధించాలని ఆశీర్వదిస్తున్నా: సద్గురు ట్వీట్

  • మొక్కలు నాటే ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సద్గురు
  • కావేరీ పిలుస్తోంది పేరిట విస్తృత ప్రచారం
  • ఉద్యమంలో పాలుపంచుకుంటున్న సమంత
  • లక్ష మొక్కలు నాటడమే లక్ష్యం

కావేరీ పిలుస్తోంది పేరిట మొక్కలు నాటే ఉద్యమానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఓ ఉద్యమం స్థాయిలో మొక్కలు నాటుతూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిల్చేందుకు సద్గురు ప్రయత్నిస్తున్నారు. ఈ ఉద్యమంలో అగ్రశ్రేణి సినీ నటి సమంత కూడా పాలుపంచుకుంటున్నారు. సమంత లక్ష మొక్కలు నాటేందుకు నడుంబిగించారు. అంతేకాకుండా, సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులను కూడా కావేరీ పిలుస్తోందిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. దీనిపై సద్గురు ట్విట్టర్ లో స్పందించారు.

"ప్రియమైన సమంత, 'కావేరీ పిలుస్తోంది కోసం' నువ్విచ్చిన పిలుపుతో ఎంతోమంది యువతీయువకులు ముందుకు వస్తున్నట్టు తెలిసింది. ఈ క్రతువులో నువ్వు లక్ష్యాన్ని మించి సాధించాలని కోరుకుంటున్నాను. ఆ దిశగా నువ్వు సఫలం కావాలని ఆశీర్వదిస్తున్నా. భవిష్యత్ తరాలకు మనం అందించే అత్యుత్తమ బహుమతి ఇదే" అంటూ ట్వీట్ చేశారు. సద్గురు మొత్తం 242 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించడం తెలిసిందే.

More Telugu News