Pakistan: పీఓకేలోని లీపా వ్యాలీలోని ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం!

  • పాక్ కు మరోసారి దీటైన జవాబు
  • టెర్రర్ లాంచ్ పాడ్ నేలమట్టం
  • పాక్ ఆర్మీ పోస్టులకు సమీపంలోనే ఉగ్ర శిబిరం

నిత్యమూ సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్ కు, భారత సైన్యం మరోసారి దీటైన జవాబిచ్చింది. ఈ తెల్లవారుజామున లీపా వ్యాలీలోని ఉగ్ర శిబిరాలను భారత జవాన్లు నేలమట్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలో ఈ లోయ ఉండగా, అక్కడ టెర్రర్ లాంచ్ పాడ్ ఉన్నట్టు సమాచారాన్ని అందుకున్న సైన్యం, వాటిని నాశనం చేసింది. పాక్ ఆర్మీ పోస్టులకు ఈ లాంచ్ పాడ్ అత్యంత సమీపంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News