Nithin: 'భీష్మ' విడుదల తేదీ ఖరారైపోయినట్టే

  • నితిన్ తాజా చిత్రంగా 'భీష్మ'
  • నెగిటివ్ రోల్ లో హెబ్బా పటేల్ 
  • డిసెంబర్ 27న సినిమా విడుదల

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ 'భీష్మ' అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని నిర్మిస్తున్నాడు. ఇంతవరకూ చేయని ప్లే బాయ్ పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. 'ఛలో' వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను అందించిన వెంకీ కుడుముల, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ సినిమాలో హెబ్బా పటేల్ నెగిటివ్ రోల్ చేస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారని అంటున్నారు. 'ఛలో' మాదిరిగా ఈ సినిమాలోనూ యూత్ కి నచ్చే అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా వెంకీ కుడుముల జాగ్రత్తలు తీసుకున్నాడని అంటున్నారు. నితిన్ - రష్మిక కాంబినేషన్ ను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు.

More Telugu News