Narasimhan: ప్రత్యేక విమానంలో చెన్నై బయల్దేరిన నరసింహన్... ఘనంగా వీడ్కోలు పలికిన కేసీఆర్

  • గవర్నర్ గా ముగిసిన నరసింహన్ ప్రస్థానం
  • ఎయిర్ పోర్టులో ఘనంగా వీడ్కోలు పలికిన కేసీఆర్
  • అంతకు ముందు ప్రగతి భవన్ లో ఘన సత్కారం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, అనంతరం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా మొత్తం 9 ఏళ్ల 9 నెలల పాటు కొనసాగిన నరసింహన్ ప్రస్థానం ముగిసింది. నేటితో ఆయన పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి భవన్ లో ఆయనను ఘనంగా సన్మానించింది. కాసేపటి క్రితం హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తన సొంత నగరమైన చెన్నైకు ఆయన బయల్దేరారు.

ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు నరసింహన్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, తెలంగాణ గవర్నర్ గా రేపు తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

More Telugu News