Andhra Pradesh: ‘అమ్మఒడి’ పథకంపై ప్రశంసలు కురిపించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని!

  • అమ్మఒడి చాలా గొప్ప పథకం
  • ప్రతీ తల్లికి రూ.15 వేలు అందుతాయి
  • ఇంగ్లిష్ విద్యాబోధన పెరగాల్సిన అవసరముంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు గుప్పించే తెలుగుదేశం నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని తొలిసారి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఒడి పథకం చాలా గొప్ప పథకమని కితాబిచ్చారు. ఈ పథకం విధివిధానాలు సరిగ్గా ఉంటే ప్రతీ తల్లికి సంవత్సరానికి రూ.15,000 అందుతాయని వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలే దేవాలయాలనీ, ఆ స్కూళ్లే ఎంతో మంది మేధావులను దేశానికి అందించాయని గుర్తుచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ విద్యాబోధన పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ‘నేను ఎవరిని పొగడటం లేదమ్మా.. ప్రెస్ వాళ్లు తప్పుగా రాయొద్దు. నేను ఎవరినీ పొగడటం లేదు’ అని కేశినేని నాని స్పష్టం చేశారు.

More Telugu News