Andhra Pradesh: టీఆర్ఎస్ నేతల జలకాలు.. డ్యామ్ వద్ద ఈతకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే

  • మహబూబ్ నగర్  అలీపూర్ లో చెక్ డ్యామ్ ప్రారంభం
  • ప్రత్యేక పూజలు నిర్వహించిన నేతలు
  • అనంతరం బ్యాక్ వాటర్ లో ఈత కొట్టిన నేతలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు మన్నెం శ్రీనివాసరెడ్డి ఈరోజు  మహబూబ్ నగర్ జిల్లాలోని అలీపూర్ చెక్ డ్యామ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం చెక్ డ్యామ్ ను ప్రారంభించిన నేతలు, తమ అనుచరులతో కలిసి బ్యాక్ వాటర్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా నీటిలోకి దూకిన ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, మన్నెం శ్రీనివాసరెడ్డి ఈత కొడుతూ సరదాసరదాగా గడిపారు. ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు భారీగా హాజరయ్యాయి.

More Telugu News