Andhra Pradesh: తమను కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్!

  • ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై పురోగతి
  • తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లో ఉత్సాహం కలిగించిన ఏపీ పరిణామం
  • విలీనం చేయకపోతే సమ్మె తప్పదన్న టీజేఎంయూ

ఇటీవలే ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై జగన్ సర్కారు సానుకూలంగా స్పందించడం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణనలోకి వస్తారు. ఈ పరిణామం తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. టీఎస్ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. లేదంటే సమ్మె తప్పదని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినట్టు టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్ వెల్లడించారు.

More Telugu News