Andhra Pradesh: ఏపీలో వ్యవసాయ మార్కెట్ కమిటీల అధికారాల నిలిపివేత

  • కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సభ్యుల అధికారాల నిలిపివేత
  • కమిటీల స్థానాల్లో ఇన్ ఛార్జ్ ల నియామకానికి ఆదేశం
  • ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఏపీలో వ్యవసాయ మార్కెట్ కమిటీల అధికారాలను నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సభ్యుల అధికారాలను నిలిపివేస్తూ ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. కమిటీల స్థానాల్లో మార్కెట్ యార్డు ఇన్ ఛార్జ్ లను నియమించాలని పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.  

More Telugu News