Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

  • 337 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 98 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4 శాతం వరకు పెరిగిన మారుతి, టెక్ మహీంద్రా

దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుతున్న వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337 పాయింట్లు పెరిగి 36,982కు చేరుకుంది. నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 10,946కు ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకీ (3.85%), టెక్ మహీంద్రా (3.83%), టాటా స్టీల్ (3.58%), ఎన్టీపీసీ (3.40%), యాక్సిస్ బ్యాంక్ (3.23%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-1.86%), సన్ ఫార్మా (-1.66%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.23%), టీసీఎస్ (-0.89%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.73%).

More Telugu News