New Delhi: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో అగ్నికి ఆహుతైన చండీగఢ్-కొచ్చువేలి రైలు బోగీ... పరుగులు తీసిన ప్రయాణికులు

  • ప్లాట్ ఫామ్ పై ఆగివున్న రైలులో మంటలు
  • రైలు జనరేటర్ బోగీలో అగ్నిప్రమాదం
  • మంటలను ఆర్పివేసేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి 8వ నెంబరు ప్లాట్ ఫామ్ పై ఆగివున్న చండీగఢ్-కొచ్చువేలి ఎక్స్ ప్రెస్ రైలు ఉన్నట్టుండి మంటల్లో చిక్కుకుంది. ఈ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన జనరేటర్ బోగీలో అగ్నిప్రమాదం జరగ్గా, కొద్దిసేపట్లోనే ఆ మంటలు తీవ్రమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు శ్రమిస్తున్నారు. కాగా, రైలు మంటల్లో చిక్కుకోవడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి.

More Telugu News